Rajnath Singh: ఇవాళ లడఖ్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్

Rajnath Singh: మూడురోజులు కొనసాగనున్న పర్యటన * బీఆర్వో ప్రాజెక్టును ప్రారంభించనున్న రాజ్‌నాథ్‌ సింగ్

Update: 2021-06-27 06:45 GMT
రాజ్ నాథ్ సింగ్ (ఫైల్ ఇమేజ్)

Rajnath Singh:  భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ ఇవాళ లడఖ్ లో పర్యటించనున్నారు. చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్దకు కూడా ఆయన వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనా ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్న తరుణంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక తన పర్యటనలో రాజ్‌నాథ్‌ సింగ్‌.. బీఆర్వో ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సైనికులను కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News