Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయాన్ని పూలతో అలంకరణ

Ayodhya Ram Mandir: రంగు రంగుల పూలతో ఆలయాన్ని అలంకరిస్తున్న కళాకారులు

Update: 2024-01-20 14:45 GMT

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయాన్ని పూలతో అలంకరణ

Ayodhya Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు మరికొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు అయోధ్యలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ మహా చరిత్రాత్మక వేడుక కోసం రామనగరి అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అలంకరణ చివరి దశలో అయోధ్యను పూలతో అలంకరించి ముస్తాబు చేస్తున్నారు.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. జై శ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్య నగరమంతా పూలతో అలంకరించారు. ఆలయంలో రామ్ లల్లాకు పట్టాభిషేకం చేసేందుకు సన్నాహాల్లో నిమగ్నమైన ప్రజల ఉత్సాహం వెల్లివిరిసింది. జనవరి 22న పవిత్రోత్సవం. ఈ వేడుకను ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రాంగణం మొత్తాన్ని రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించేందుకు పలువురు కళాకారులు తరలివచ్చారు. ఆలయాన్ని అలంకరించేందుకు తాజా పుష్పాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా రంగు రంగుల పూలు మాత్రమే కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News