దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24 గంటల్లో 6767 కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది.

Update: 2020-05-24 04:49 GMT
Representaional Image

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది.గత 24 గంటల్లో దేశంలో 6,767 మందికి కొత్తగా కరోనా సోకినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం.. ఇవాళ ఒక్క రోజే అత్యధిక కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. అదే సమయంలో 147 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,867కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,31,868కి చేరింది. 73,560 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News