Coronavirus: కేంద్రం మరో కీలక నిర్ణయం

Coronavirus: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం.

Update: 2021-04-01 09:48 GMT

Coronavirus: కేంద్రం మరో కీలక నిర్ణయం

Coronavirus: దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఏప్రిల్‌ నెలలో అన్ని రోజులు టీకా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. గెజిటెడ్‌ సెలవు రోజుల్లోనూ టీకా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది. వ్యాక్సినేషన్‌ కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఎక్కువ మందికి టీకాలు అందించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది.

Tags:    

Similar News