Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్
Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్ చేశారు.
Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్
Prashant Kishor: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్ చేశారు. విపక్షాలకు సారధ్యం వహించే హక్కు కాంగ్రెస్కు లేదని ట్వీట్ చేశారు. పదేళ్లలో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్న పీకే విపక్షాలకు నేతృత్వం వహించడం దేవుడు ఇచ్చిన హక్కుగా కాంగ్రెస్ భావిస్తోందన్నారు ప్రశాంత్ కిశోర్. కొన్ని నెలల క్రితం రాహుల్ గాంధీతో చర్చలు నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన రూటు మార్చినట్లు తెలుస్తోంది. ముంబైలో బుధవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో కొత్త మార్పు కలుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ బలంగా ఉండాలని.. ఇక విపక్ష సారధిని ప్రజాస్వామ్య రీతిలో ఎన్నుకోవాలని ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు.