Delhi: ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

Delhi: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రధానంగా జరగనున్న చర్చ

Update: 2022-04-20 01:04 GMT

ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం  

Delhi: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కానున్నది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సోనియా అధ్యక్షతన నేతలు సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల తేదీలపై ప్రధానంగా చర్చించనున్నారు. అదే విధంగా వచ్చే నెలలో రాజస్థాన్ లని ఉదయ్ పూర్ లో నిర్వహించనున్న కాంగ్రెస్ చింతన్ శివిర్ భేటీ తేదీలను ఖరారు చేయనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాల్లో పార్టీ పూర్తి కాలపు అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నారు.  

Full View


Tags:    

Similar News