నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌, టి.కాంగ్రెస్‌ ఇంఛార్జీ మున్షీ

Delhi: పార్లమెంటు ఎన్నికలు, నామినేటెడ్‌ పదవుల భర్తీపై.. ఖర్గే, రాహుల్‌తో చర్చించనున్న రేవంత్‌రెడ్డి, మున్షీ

Update: 2024-01-11 03:02 GMT

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌, టి.కాంగ్రెస్‌ ఇంఛార్జీ మున్షీ

Delhi: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, టీ కాంగ్రెస్‌ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ వెళ్లనున్నారు. ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి అధిష్టానం నుండి పిలుపొచ్చింది. లోక్​సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకులకు పార్టీ హైకమాండ్​దిశానిర్దేశం చేయనుంది. లోక్​సభ ఎన్నికలపై చర్చించిన అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్​పదవుల భర్తీపైనా అధిష్ఠానంతో పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Tags:    

Similar News