లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ తిరుగుబాటు ఎంపీ శతృఘ్న సిన్హా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలోకాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన 'బీజేపీ వన్మ్యాన్ షో– టూ మెన్ ఆర్మీ'గా మారిందనీ, పార్టీలో చర్చలకు అవకాశందనీ, ప్రశ్నించిన వారిపై తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గాంధీజీ, నెహ్రూ వంటి మహామహులున్న పార్టీ అన్నారు.
ఎల్కే అడ్వాణీ, జశ్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా వంటి కీలక నేతలకు గౌరవం దక్కలేదు. ప్రతిదీ ప్రధాని కార్యాలయమే నిర్ణయిస్తోంది. మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు మతిలేని చర్య. దీని కారణంగా ఎంతో మంది చనిపోయినా పట్టించుకోలేదు. బీజేపీ ప్రచారం కోసం వెచ్చించే డబ్బును అభివృద్ధిపై ఖర్చుపెడితే దేశం ఎంతో బాగుపడదని అన్నారు. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం. రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అవుతారని ఆయన జోస్యం చెప్పారు.