అయ్యప్ప భక్తులకు శుభవార్త.. విమానాల్లో కేబిన్ లగేజీలో ఇరుముడి తీసుకెళ్లే అవకాశం
*అనుమతిస్తున్న బీసీఏఎస్.. అన్ని విమానాశ్రయాల్లో సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు
Irumudi: బరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి విమానాల్లో వెళ్లే భక్తులకు శుభవార్త. ఇరుముడిని భక్తులు విమాన క్యాబిన్ లగేజీల్లో తమ వెంట తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తాత్కాలికంగా అనుమతించింది. ప్రస్తుత శబరిమల యాత్ర సీజన్కు సంబంధించిన మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే జనవరి 20వ తేదీ వరకు మాత్రమే ఈ అనుమతి ఉంటుందని తెలింది. ఈ మేరకు ఏఎస్జీ అదనపు భద్రతా చర్యలు, చెకింగ్ చేపడతుతుందని బీసీఏఎస్ తెలిపింది.