ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ భేటీ.. తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
Bandi Sanjay: అసెంబ్లీ ఎన్నికలకు కష్టపడి పనిచేయాలని సంజయ్కు చెప్పిన అమిత్ షా
ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ భేటీ.. తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
Bandi Sanjay: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని హోంమంత్రి కార్యలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తరువాత అమిత్ షాను బండి సంజయ్ కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని గెలిపించాలంటే కష్టపడి పనిచేయాలని బండి సంజయ్కు అమిత్ షా సూచించారు.