Goa: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్

Goa: అమిత్ పాలేకర్ పేరును ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్

Update: 2022-01-19 07:59 GMT

గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్

AAP CM Candidate in Goa: భారత దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని ముందస్తుగానే తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రకటించారు. ఇందులో భాగంగా గోవాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. అమిత్ పాలేకర్ తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. గోవాలో ఉన్న 40 స్థానాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక అమిత్ పాలేకర్ వృత్తి రీత్యా అడ్వకేట్. ఆయన భండారి సామాజిక వర్గానికి చెందిన వారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

Tags:    

Similar News