అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తొలి భారత పర్యటన కోసం తన భార్య మెలానియా ట్రంప్తో కలిసి ఈ రోజు అహ్మదాబాద్ చేరుకోనున్నారు. కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఇక కీలక అంశాల్లో భారత్తో జరిగే చర్చల్లో పాలు పంచుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా భారత్ వస్తోంది.
ఉదయం 11:40 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు ట్రంప్.. తన పర్యటన సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి రోడ్షోలో పాల్గొంటారు.. ఈ రోడ్ షో కు 'ఇండియా రోడ్షో' అని పేరు పెట్టారు.. దాదాపు 22 కిలోమీటర్ల మార్గంలో ఈ రోడ్ షో జరగనుంది.. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుండి నృత్య బృందాలు మరియు గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు.
కాగా ట్రంప్ తన గుజరాత్ ప్రయాణ సందర్భంగా భారతదేశ సాంస్కృతిక పాట్పౌరీ రుచిని ఆస్వాదిస్తారు. మరోవైపు ట్రంప్ పర్యటన నేపథ్యంలో తాజ్ మహల్ ను సందర్శించడానికి సందర్శకులకు ఆంక్షలు విధించారు. "ప్రజలు ఉదయం 11:30 వరకు తాజ్ సందర్శించవచ్చు.. మధ్యాహ్నం నుంచి అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు అధిక భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా సందర్శకుల నుండి ప్రాంగణం ఖాళీ చేయబడుతుంది" అని అధికారులు తెలిపారు.
అలాగే ట్రంప్ పర్యటనకు ముందు అహ్మదాబాద్లోని మోటెరా స్టేడియం వెలుపల భద్రత కట్టడి చేశారు.. మైదానంలో 12,000 మంది భద్రతా సిబ్బంది, అహ్మదాబాద్లో స్కైస్ పెట్రోలింగ్ చేయడానికి IAF సిబ్బంది అందుబాటులో ఉన్నారు. మోటెరా స్టేడియం వెలుపల తాగునీటి కోసం మొత్తం 16 స్పాట్ లు ఏర్పాటు చేశారు. స్టేడియంలో జరిగే 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి వచ్చే ప్రజలకు తాగునీటి ఏర్పాట్లు చేయడానికి ప్రతి ప్రదేశంలో అమ్దావాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముగ్గురు సిబ్బందిని ఏర్పాటు చేసింది.
ట్రంప్ నేటి షెడ్యూల్..
ఉదయం..
11:40.. అహ్మదాబాద్లోని సర్దార్
వల్లభాయ్ అంతర్జాతీయ
విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్
మధ్యాహ్నం
12:15.. ట్రంప్, మోదీలు కలసి
సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు
01:05.. మొతెరా స్టేడియంలో
నమస్తే ట్రంప్ కార్యక్రమం
03:30.. ఆగ్రాకు ప్రయాణం
సాయంత్రం
04:45.. ఆగ్రాకు చేరుకుంటారు
05:15.. తాజ్మహల్ సందర్శన
06:45.. ఢిల్లీకి ప్రయాణం
07:30.. ఢిల్లీకి చేరుకుంటారు