దారుణం.. భర్త కొట్టాడని ఆరుగురు పిల్లలను బావిలోకి తోసి చంపిన తల్లి

Raigad: ఓ తల్లి తన ఆరుగురు పిల్లలను దారుణంగా చంపేసింది.

Update: 2022-05-31 13:14 GMT

దారుణం.. భర్త కొట్టాడని ఆరుగురు పిల్లలను బావిలోకి తోసి చంపిన తల్లి

Raigad: ఓ తల్లి తన ఆరుగురు పిల్లలను దారుణంగా చంపేసింది. ఇంట్లో రగిలిన గొడవతో తన సంతానాన్ని కడతేర్చింది. బావిలో పడేసి ఆరుగురి ప్రాణాలను తీసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో అయిదుగురు అమ్మాయిలే ఉన్నారు. మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహద్ తాలూకాలోని ఖారావలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భర్త, కుటుంబీకులు కొట్టడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. బావిలో పడి ప్రాణాలు కోల్పోయిన పిల్లలు వయసు 18 నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News