బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి

Update: 2020-09-04 08:45 GMT

తమిళనాడులోని కడలూరులో విషాదం చోటుచేసుకుంది. కడలూరులోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. రాష్ట్ర రాజధాని చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలోని కట్టుమన్నార్‌ కోయిల్‌ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఫ్యాక్టరీ యజమాని కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కట్టుమన్నార్‌కోయిల్‌లో ఈ బాణాసంచా ఫ్యాక్టరీకి లైసెన్స్ ఉందని, వీరంతా ఇక్కడి పనిచేసే కార్మికులని కడలూరు ఎస్‌పి శ్రీఅభినవ్ తెలిపారు.



Tags:    

Similar News