24 గంటల్లోనే తడాఖా చూపిన ఇండియన్ ఆర్మీ.. రాహుల్ హంతకుల ఎన్ కౌంటర్..

Rahul Bhat: కేవ‌లం 24 గంట‌ల్లోనే భార‌త సైన్యం త‌న త‌డాఖా చూపించింది.

Update: 2022-05-13 15:14 GMT

24 గంటల్లోనే తడాఖా చూపిన ఇండియన్ ఆర్మీ.. రాహుల్ హంతకుల ఎన్ కౌంటర్..

Rahul Bhat: కేవ‌లం 24 గంట‌ల్లోనే భార‌త సైన్యం త‌న త‌డాఖా చూపించింది. క‌శ్మీరీ పండిట్ ఉద్యోగి రాహుల్ భ‌ట్‌ను హ‌త్య చేసిన ఉగ్రవాదుల‌ను ఇండియన్ ఆర్మీ ఎన్‌కౌంట‌ర్ చేసింది. రాహుల్ భ‌ట్‌ను చంపిన ఉగ్రవాదుల‌ను 2 రోజుల్లోగా గుర్తించి, ఎన్‌కౌంట‌ర్ చేస్తామ‌ని ఆర్మీ ఆయ‌న భార్యకు హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ఒక్క రోజులోనే భార‌త సైన్యం రాహుల్ భ‌ట్‌ను చంపిన ఉగ్రవాదులను హతం చేసింది. బందీపూరాలో ముగ్గురు ఉగ్రవాదుల‌ను ఆర్మీ మ‌ట్టుబెట్టింది. ఈ ముగ్గురిలో ఇద్దరు రాహుల్ భ‌ట్‌ను హ‌త్య చేయ‌డంలో పాత్ర పోషించిన వారేన‌ని అధికారులు స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు తహసీల్దార్‌ కార్యాలయంలోని చొరబడి కశ్మీర్‌ పండిట్‌ ఉద్యోగి రాహుల్ భట్ ను కాల్చి చంపారు.

Tags:    

Similar News