Breaking: నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. ఢిల్లీ హై కోర్టులో విచారణ

Update: 2020-03-19 15:49 GMT

ఢిల్లీలో సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో నలుగురు మరణశిక్ష శిక్షకుల్లో ముగ్గురు గురువారం సాయంత్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తమ ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని కోరుతూ ముగ్గురు దోషులు పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను రాత్రి 9 గంటలకు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

డెత్ వారెంట్లు నిలిపివేయాలని కోరుతూ అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ - చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు గురువారం మధ్యాహ్నం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ తాజాగా దాఖలు చేసిన ఈ పిటిషన్ ను కొట్టివేసినట్టయితే శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నిర్భయ కేసులోని నలుగురు నిందితులను ఉరి తీయనున్నారు.

Tags:    

Similar News