గుజరాత్‌లో మరోసారి రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 13 మందికి గాయాలు

Update: 2020-02-24 04:53 GMT

గుజరాత్‌లో మరోసారి రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 13 మందికి గాయాలు జరిగింది. ఇళ్లకు, దుకాణాలకు నిప్పంటించారు. ఈ సంఘటనల్లో 13 మంది గాయపడ్డారు. వాస్తవానికి గత నెలలో గుజరాత్ ఆనంద్ జిల్లా అక్బర్పూర్ లోని కంభట్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పుడే ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మళ్ళీ, అక్బర్పూర్లో నిన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువైపులా రాళ్లు రువ్వుకున్నారు.. అనేక చోట్ల ఇళ్లు, దుకాణాలకు నిప్పంటించారు. ఈ సంఘటనల్లో మొత్తం 13 మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. అగర్పూర్‌లో ఇప్పటికే ద్వైపాక్షిక ఘర్షణలు జరిగాయి. దీంతో ఈ ప్రాంతంలో పోలీసుల భద్రత పెరిగింది. అక్కడ ప్రస్తుతం మూడంచెల భద్రత కొనసాగుతోంది.  

Tags:    

Similar News