Vijay Deverakonda: ఈడీ విచారణకు హాజరైన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు సినీనటుడు విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు.

Update: 2022-11-30 06:52 GMT

Vijay Deverakonda: ఈడీ విచారణకు హాజరైన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు సినీనటుడు విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు. లైగర్ మూవీకి సంబంధించి అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం పెట్టుబడుల విషయంలో ఈడీకి ఫిర్యాదు అందింది. లైగర్‌ సినిమాకు సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు గతంలో ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించి ఈనెల 17న పూరీ జగన్నాథ్, ఛార్మి విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది.

Tags:    

Similar News