గుర్తుపట్టలేనంతగా.. వేణుమాధవ్ చివరి ఫోటో!

తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయించి.. తనకంటూ ఒక ప్రత్యెక ఇమేజి సృష్టించుకున్న నటుడు వేణుమాధవ్ ఈరోజు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీ అంతా విషాదంలో మునిగిపోయింది.

Update: 2019-09-25 16:35 GMT

తెలుగు తెరపై నవ్వుల పువ్వులు పూయించి.. తనకంటూ ఒక ప్రత్యెక ఇమేజి సృష్టించుకున్న నటుడు వేణుమాధవ్ ఈరోజు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీ అంతా విషాదంలో మునిగిపోయింది. వేణుమాధవ్ కు టాలీవుడ్ లో అందరు నటులతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి.

వేణుమాధవ్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల యశోదా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఆ సమయంలో హీరో రాజశేఖర్ ఆయనను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంలో వేణుమాధవ్ తో ఆయన ఓ ఫోటో దిగారు. ఇప్పుడు రాజశేఖర్ ఆ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో వేణుమాధవ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో వేణుమాధవ్ చివరి ఫోటోగా చెబుతున్నారు.


Tags:    

Similar News