Uday Kiran: ఓటీటీలో ఉదయ్‌ కిరణ్‌ చివరి సినిమా!

Uday Kiran: హీరో ఉదయ్‌ కిరణ్‌ 2014లో చనిపోయాడు. దాదాపు ఏడేళ్లు కావోస్తుంది.

Update: 2021-06-03 16:15 GMT

ఉదయ్ కిరణ్ (ఫొటో ట్విట్టర్)

Uday Kiran: హీరో ఉదయ్‌ కిరణ్‌ 2014లో చనిపోయాడు. దాదాపు ఏడేళ్లు కావోస్తుంది. ఆయన చివరిసారి నటించిన సినిమా 'చిత్రం చెప్పిన కథ'. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, ఉదయ్ కిరణ్ మరణించిన 2 నెలలకు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కానీ, పలు కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాలో మదల్సా శర్మ హీరోయిన్‌ గా నటించింది.

ఈ సినిమా తీసేప్పుడు పలువురు సన్నిహితులతో ఉదయ్ కిరణ్.. తన సినీ కేరీర్‌కు చాలా హెల్ప్‌ అవుతుందని చెప్పాడని సమాచారం. అయితే, ఈ సినిమా చివరి దశలో ఉన్నప్పుడు కొన్ని వ్యక్తిగత కారణాలతో ఉదయ్ కిరణ‌్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

మరలా ఇన్నేళ్లకు ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. అయితే 2020లో లాక్‌డౌన్‌ సమయంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారని టాక్ నడిచింది. కానీ, రేటు విషయంలో మేకర్స్‌ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రస్తుతం అనేక సినిమాలు ఓటీటీలోనే విడుదలవున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు అధికంగానే ఆఫర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరో తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎదరయ్యే సంఘటనలు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం. మొత్తానికి 2013లో విడుదల కావాల్సిన 'చిత్రం చెప్పిన కథ' ఎనిమిదేళ్ల తర్వాత విడుదల కానుంది.

Full View

Tags:    

Similar News