Sravani Case: ట్విస్ట్‌ ఇచ్చిన పోలీసులు !

Update: 2020-09-16 05:28 GMT

సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణ అనేక మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. శ్రావణి మృతి కేసులో పోలీసులు టిస్ట్‌ ఇచ్చారు. రిమాండ్ రిపోర్టులో ఏ1 గా దేవరాజ్ రెడ్డి, ఏ 2 గా సాయి కృష్ణారెడ్డి, ఏ 3 గా అశోక్ రెడ్డిని చేర్చారు. అయితే, మొన్న (ఆదివారం) మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఏ3 గా దేవరాజ్‌ పేరును వెల్లడించిన పోలీసులు తాజాగా అతన్ని ఏ1 గా పేర్కొన్నారు. కేసును మరింత లోతుగా విచారించిన తరువాతే పోలీసులు ఈ రకమైన మార్పులు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రావణి ఎంతగా కోరినా దేవరాజ్ ఒప్పుకోలేదని.. ఈ కారణంగానే శ్రావణి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో 17 మంది సాక్షులను విచారించినట్టు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.



Tags:    

Similar News