టాలీవుడ్‌లో మరో విషాదం: ప్రముఖ నటుడు గుండెపోటుతో మృతి

Update: 2020-12-02 11:30 GMT

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు యాధాకృష్ణ గుండెపోటుతో చనిపోయారు. యాధాకృష్ణ 20కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. అలాగే అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చివరిగా 2011లో వచ్చిన సంక్రాంతి అల్లుడు సినిమాలో యాధాకృష్ణ నటించాడు. ఇ.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాను డైరెక్ట్‌గా చేయగా.. ఇందులో యాధాకృష్ణతో సునాక్షి భరద్వాజ్ కలిసి నటించింది. ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News