Breaking News: ఆచార్యకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

Breaking News: టికెట్ల రేట్లను పెంపునకు గ్రీన్‌సిగ్నల్

Update: 2022-04-26 04:11 GMT

ఆచార్యకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

Breaking News: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న కుమారుడు రాంచ‌ర‌ణ్ కలిసి న‌టించిన తాజా చిత్రం ఆచార్య ఈ నెల 29న విడుద‌ల కానుంది. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని యూసుఫ్‌గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జ‌రిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఐదో ఆట‌కు అనుమ‌తి మంజూరు చేస్తూ తెలంగాణ స‌ర్కారు కీల‌క ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 29న విడుద‌ల కానున్న అచార్య చిత్రాన్ని ఏడు రోజుల పాటు రోజుకు 5 ఆట‌ల చొప్పున ప్రద‌ర్శన‌కు వీలుంది.

అంతేకాకుండా సినిమా హాళ్లలో ఆయా కేట‌గిరీల‌ను బ‌ట్టి టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు కూడా సినిమా థియేట‌ర్లకు ప్రభుత్వం అనుమ‌తినిచ్చింది. ఏసీ కేటగిరీలో మాత్రమే ఈ పెంపును ప్రభుత్వం అనుమ‌తించింది. ఈ ధ‌ర‌ల‌ను 30 నుంచి 50 రూపాయలకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ల పెంపును కూడా ఏడు రోజుల వ‌ర‌కు మాత్రమే అనుమ‌తించింది. 

Tags:    

Similar News