సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన స్మితాసబర్వాల్

Update: 2019-11-17 10:51 GMT
Smitasabarwal

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులను సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్ పరిశీలించారు. అశ్వాపురం మండలం బీజీకొత్తూరులో ప్రాజెక్టు పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ఫేజ్-1 పంప్‌హౌస్ నిర్మాణ పనులు పరిశీలించి అనంతరం పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ, వరంగల్‌ జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేలా దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News