నా క్యారెక్టర్ అలాంటిది.. నెటిజన్ ట్రోల్స్కు చెక్ పెట్టిన రష్మిక
అయితే కొందరు నెటిజన్లు ఆమె ఈ సినిమాలో అతిగా చేసిందని విమర్శలు చేశారు. రష్మిక ప్రతీదానికి అతిగా ఎగ్జైట్ అవుతూ.. ఓవర్ యాక్షన్ చేసిందని నెటిజన్లు ట్రోల్ చేశారు.
హిట్ ఫట్టుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చెస్తూపోతున్నారు టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ రష్మిక మందన్నా. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ క్యూట్ హీరోయిన్ రష్మిక మందన్నా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో 'హీ సో స్వీట్.. హీ సో క్యూట్' సాంగ్ లో ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసిన అభిమానులు మంత్రముగ్ధులైపోయారు. అయితే కొందరు నెటిజన్లు ఆమె ఈ సినిమాలో అతిగా చేసిందని విమర్శలు చేశారు. రష్మిక ప్రతీదానికి అతిగా ఎగ్జైట్ అవుతూ.. ఓవర్ యాక్షన్ చేసిందని నెటిజన్లు ట్రోల్ చేశారు. కాగా ఈ ముద్దుగుమ్మ తనపై వచ్చిన విమర్శలపై తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది. కొందరు నెటిజన్లు తాను అతిగా చేశానని.. కానీ తనకిచ్చిన క్యారెక్టర్ అలాంటిదని చెప్పుకొచ్చింది.
తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయడం బాధ్యతగా తెలిపింది. ' విమర్శలను నేను మనసారా ఆస్వాదిస్తాను. ఈ చిత్రంలో నా పాత్ర(క్యారెక్టర్) ఎలా డిజైన్ చేశారో అందుకు అనుగుణంగా నటించానని, నిజానికి ఆ పాత్ర కోసం ఎంతో శ్రమించాను. ఎందుకంటే నేను ఇప్పుడీ స్థాయిలో ఉండటానికి అవే కారణమని నమ్ముతున్నాను. నన్ను నేను మెరుగుపర్చుకోడానికి కష్ట పడతానని' తెలిపింది.
నితిన్ జోడీగా 'భీష్మ' చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎందురు చూస్తున్నాని తెలిపింది. భీష్మలో సినిమాతో తన పాత్ర ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని వెల్లడించింది. 'భీష్మ' సినిమా శుక్రవారం విడుదల కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా చెస్తున్నారు. స్వరసాగర్ బాణీలు సమకూర్చారు.