మరొకసారి నాగార్జునతో నటించబోతున్న సమంత

Update: 2019-04-30 08:19 GMT

ఈమధ్యనే 'దేవదాసు' సినిమాతో డిజాస్టర్ అందుకున్న అక్కినేని నాగార్జున ఇప్పుడు తన సూపర్ హిట్ సినిమా అయిన 'మన్మధుడు' కి సీక్వెల్ గా 'మన్మధుడు 2' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మధ్యనే 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతుంది. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షూటింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్షర గౌడ్ కూడా రెండో హీరోయిన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అంతే కాక ఈ సినిమాలో అక్కినేని కోడలు సమంత కూడా ముఖ్య పాత్ర పోషించబోతోంది అని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సమంత, నాగార్జున 'మనం', 'రాజు గారి గది 2' సినిమాలలో కలిసి నటించారు. పైగా రాహుల్ రవీంద్రన్ కి సమంత కూడా మంచి స్నేహితురాలు. ఈ నేపథ్యంలో 'మన్మధుడు 2' సినిమాలో ఒక స్పెషల్ రోల్ పోషించేందుకు వెంటనే ఒప్పేసుకుంది సమంత. అక్కినేని నాగార్జున, పి కిరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Similar News