క్లీన్ సర్టిఫికెట్ తో బయటకు వచ్చిన మెగా హీరో సినిమా

Update: 2019-04-08 10:24 GMT

వరుసగా ఆరు డిజాస్టర్ల ను అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన 'చిత్రలహరి' పైనే పెట్టుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.

క్లీన్ 'యూ' సర్టిఫికేట్ తో 'చిత్రలహరి' సినిమా సెన్సార్ నుంచి బయటకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 12వ తారీఖు న విడుదలకు సిద్ధంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి బయటకు వచ్చిన కొన్ని పాటలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. సునీల్ వెన్నెల కిషోర్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. సినిమాలో సక్సెస్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విజయ్ అనే యువకుడి పాత్ర లో కనిపించిన సాయి ధరంతేజ్ ఈ సినిమాతో నిజజీవితంలో కూడా విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాడు.

Similar News