'గల్లీ బాయ్' తెలుగు రీమేక్ గురించి క్లారిటీ ఇచ్చిన మెగా మేనల్లుడు

Update: 2019-04-10 11:58 GMT

రణ్వీర్ సింగ్, అలియా భట్ ముఖ్య పాత్రల్లో కనిపించిన 'గల్లీ బాయ్' సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకుంది గీత ఆర్ట్స్. తెలుగు రీమేక్ లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నట్టు పుకార్లు బయటకి వచ్చాయి. తాజాగా 'చిత్రలహరి' సినిమా ప్రమోషన్స్ చేస్తున్న సాయి ధరంతేజ్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. 'గల్లీ బాయ్' తెలుగు రీమేక్ మీరే చేస్తున్నారా అని అడుగగా అసలు ఇంతవరకు తాను 'గల్లీ బాయ్' చూడలేదు అని చెప్పి సాయి ధరంతేజ్ షాకిచ్చారు.

అంతేకాక ఈ పుకార్లలో నిజం లేదని, 'గల్లీ బాయ్' రీమేక్ తాను చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం 'చిత్రలహరి' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు తేజ్. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. వరుసగా ఆరు డిజాస్టర్లు అందుకున్న మెగా మేనల్లుడు ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. 

Similar News