ఒక రొమాంటిక్ క్రైమ్, కధ, ఒక క్రిమినల్ ప్రేమ కధలను తెరకెక్కించిన దర్శకుడు పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "రొమాంటిక్ క్రిమినల్స్". ప్రస్తుతం ఈ సినిమా టిజర్ మరియు పోస్టర్లు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి .ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ బ్యానర్ల పై రవీందర్ బాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు. హీరోగా మనోజ్ నందన్, విలన్గా వినోద్, హీరోయిన్లుగా అవంతిక, దివ్య, మౌనిక నటించారు.
చాటు మాటుగా రొమాన్స్ చేసే సన్నివేశాలుని పచ్చి పచ్చిగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది . రొమాన్స్ నుండి చెడ్డదారి పట్టిన యువత క్రైమ్ చర్యలకు ఎలా పాల్పడుతున్నారు అన్నది సినిమా నేపద్యంగా సాగానుందట .. విడుదల చేసిన టిజర్ లో యూత్ ని ఎక్కువగా టార్గెట్ గా చేసి మసాలను కొచం ఎక్కువగా పెంచినట్టు కనిపిస్తుంది. ముద్దు సన్నీవేశాలు, రొమాంటిక్ సీన్ల డోస్ సినిమాలో ఏ రేంజిలో ఉంటాయో సినిమా టిజర్ చెప్పకనే చెప్పేస్తుంది .
టిజర్ లో కాలేజీ కెమిస్ట్రీ ల్యాబ్లో తన ప్రియుడితో రొమాన్స్ చేస్తూ ప్రిన్సిపాల్కు దొరికిపోయిన అమ్మాయి మీపై యాక్షన్ తీసుకుంటానని చెప్పిన ప్రిన్సిపాల్ను బెదిరించిన సీన్లు ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. ''నన్ను నీ పక్కలో పడుకోమన్నావని, రెండేళ్లుగా వాడుకుదొబ్బుతున్నావని ఏడుస్తూ టీవీ చానల్స్లో లైవ్లో కూర్చుంటా. నాకు రెండు సార్లు అబార్షన్ చేయించావని నీ ఇంటి ముందు టెంట్ వేయించి మరీ పరువు తీస్తా.'' అనే డైలాగ్స్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది . ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .