దగ్గుపాటి రానా గతకోద్దికాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనితో రానాకి ఏమైందని ఫ్యాన్స్ భాదపడ్డారు. కానీ నాకు ఏమి కాలేదని రానా చెప్పుకొచ్చారు. అయిన అయన ఆరోగ్య సమస్యలపై వార్తలు ఆగలేదు. దీనిపై అయన తండ్రి సురేష్ బాబు కూడా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. రానాకి ఏమి కాలేదని త్వరలో సినిమాల్లో కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా రానాకి అభిమానులు వరుసగా ట్వీట్లు చేయడంతో రానా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. " నేను చెప్పేవరకు నా గురించి వచ్చే వార్తలను మీరు నమ్మకండి" అంటూ రానా పోస్ట్ చేసారు. ప్రస్తుతం రానా వెంకీ ఉడుముల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రానాకి జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. ఇదే కాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయనున్నాడు.
If Its about me and I don't tweet it. It's NOT TRUE!! ;)
— Rana Daggubati (@RanaDaggubati) October 23, 2019