ట్రంప్‌పై వర్మ సెటైర్.. సోషల్ మీడియాలో వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24 మంగళవారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే.

Update: 2020-02-26 17:11 GMT
Ram gopal Varma File Photo

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24 మంగళవారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొతెరా స్టేడియంలో 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఇచ్చిన విందు కార్యక్రమం ముగించుకొని ఆయన బుధవారం సాయంత్రం అమెరికా తిరిగి వెళ్లారు. ట్రంప్ భారత్ పర్యటనపై ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొతెరా స్టేడియంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్‌ల మధ్య ఓ సంభాషణను ఉద్దేశిస్తూ.. సరదాగ ట్వీట్ చేశారు.

రాంగోపాల్ వర్మ ట్వీట్ లో

ట్రంప్ : ఈ 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో నాకు స్వాగతం పలికేందుకు 70 లక్షల మంది ప్రజలు వస్తారని చెప్పావు కదా.. లక్ష మందే వచ్చారేంటి?'

మోదీ : 'అమెరికా 1 డాలర్‌ ఇండియన్ రూ.70 ఎలా సమానమో.. అలాగే ఒక గుజరాతీ 70 మంది అమెరికన్లకు సమానం' అని మోదీ సమాధానం.

ఇలా ట్రంప్ , మోదీ సంభాషించినట్లు వర్మ తన ట్విటర్‌లో సరదాగా రాసుకొచ్చారు. ప్రస్తుతం వర్మ ట్వీట్‌ నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. 



Tags:    

Similar News