మెగా సినిమా ప్రమోషన్స్ లో నందమూరి హీరో

Update: 2019-03-28 07:06 GMT

గత కొంతకాలంగా కేవలం డిజాస్టర్ లకు మాత్రమే అందుకున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి తేజ్ ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా 'చిత్రలహరి' పైనే పెట్టుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదపేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటించారు. టీజర్ తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ను మొదలు పెట్టింది ఈ చిత్ర బృందం. తాజాగా 'చిత్రలహరి' సినిమా రిలీజ్ వేడుకలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

ఎప్పటిలాగానే ఏ మెగా హీరోను ముఖ్య అతిథిగా ఈ వేడుకకు విచ్చేస్తారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ సారి చిత్రబృందం నందమూరి నట వారసుడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. తారక్ కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి చిత్రలహరి ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా విచ్చేసేందుకు ఒప్పుకున్నాడు. తేజ్ తనకి మంచి మిత్రుడు పైగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పతాకంపై నే తారక్ 'జనతాగ్యారేజ్' అనే సూపర్ హిట్ అందుకున్నాడు. అందుకే వారు పిలవగానే వెంటనే ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ వేడుక జరగనుంది.

Similar News