Naga Shaurya: "వరుడు కావలెను" ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాదు అంటున్న నాగశౌర్య

Naga Shaurya: నాగ సూర్య మరియు రీతు వర్మ హీరోహీరోయిన్లుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "వరుడు కావలెను

Update: 2021-10-26 13:55 GMT

వరుడు కావలెను (ఫైల్ ఇమేజ్)

Naga Shaurya: నాగ సూర్య మరియు రీతు వర్మ హీరోహీరోయిన్లుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "వరుడు కావలెను". టైటిల్ చూస్తే ఈ సినిమా ఫిమేల్ సెంట్రిక్ సినిమా లాగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం హీరోయిన్ రీతు వర్మ పోషించిన లక్ష్మీ సౌజన్య పాత్ర చుట్టూ తిరుగుతుందని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదట కేవలం ప్రమోషన్స్ కోసమే దర్శక నిర్మాతలు ఇలా చేస్తున్నారని సమాచారం. సినిమా కథ మొత్తం నాగశౌర్య పాత్ర చుట్టూ మాత్రమే తిరుగుతుందట. ఇక రీతు వర్మ పాత్ర ప్రవర్తన వెనక గల కారణాలు సెకండాఫ్ లో మాత్రమే చూపిస్తాడట.

సెకండ్ హాఫ్ లో నడిచే ఒక 15 నిమిషాలు ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అని దానికి సంబంధించిన ఏది ప్రమోషనల్ కంటెంట్ లో చూపించడం లేదని అది ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ గా ఉంటుందని అంటున్నారు నాగశౌర్య. రీతు వర్మ పాత్ర ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఉంటుందట. ఈ నేపథ్యంలోనే ఒక ఆర్కిటెక్ట్ గా ఆమెకు పరిచయం అవుతాడు నాగ శౌర్య. వారిద్దరి మధ్య జరిగే ప్రేమకథ ఈ సినిమా కథ అని తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నెల 29 న "వరుడు కావలెను" సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.

Tags:    

Similar News