ఖతార్ రాజధాని దోహాలో 'సైమా' అవార్డుల వేడుక అట్టహాసంగా జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ అవార్డుల వేడుకలో మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్ కూడా నామినేట్ అయ్యారు. ఆమె కూడా కార్యక్రమానికి హాజరు అయ్యారు. మహానటి సావిత్రిని గుర్తుచేస్తూ చీరకట్టులో సంప్రదాయాబద్ధంగా వచ్చిన కీర్తి సురేష్ అందరి దృష్టినీ ఆకర్షించారు.
అయితే, ఆమె సంప్రదాయానికే కాదు.. ఆమె వినయానికీ సైమా అవార్డుల ఫంక్షన్ కి హాజరైన అందరూ ముగ్దులయిపోయారు. అక్కడ కూచుని ఉన్న చిరంజీవి ద్దకు వెళ్లిన కీర్తి.. ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ మోకాళ్లపై కూర్చొని ముచ్చట్లాడారు. చిరంజీవి కూడా కీర్తి చేయి పట్టుకుని నవ్వుతూ మాట్లాడారు. ఈ ఫోటో ఇప్పుడు నేట్టింట వైరల్ అవుతోంది. దీంతో కీర్తి మెగా అభిమానులనే కాదు సినీ ప్రేమికులందరి మనసునూ దోచుకున్నారు.
A moment of grace and humbleness - @KeerthyOfficial reflects her admiration towards an icon and epitome of Indian Cinema, Chiranjeevi sir.#PantaloonsSIIMA #SIIMAinQatar #VisitQatar #QatarAirways #Helo #ONEFMQATAR pic.twitter.com/r2UOV67LPw
— SIIMA (@siima) August 15, 2019