ఆప్షన్ ఎన్కౌంటర్ మాత్రమే..
దిశ హత్యోదంతం దేశ ప్రజల మనసుల్ని కలిచివేసింది. నిందితులను కఠినంగా శక్షించాలని ప్రజలంతా ముక్తకంఠంతో నినదించారు.
దిశ హత్యోదంతం దేశ ప్రజల మనసుల్ని కలిచివేసింది. నిందితులను కఠినంగా శక్షించాలని ప్రజలంతా ముక్తకంఠంతో నినదించారు. దిశను అత్యంత కిరాకతకంగా, పాశవికంగా అత్యాచారం చేసి సజీవంగా చంపిన నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆధారాలు సేకరించడం కోసం ఘటనాస్థలికి తీసుకెళ్లిన పోలీసులపై దాడికి యత్నించడంతో నిందితులను ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనపై టాలీవుడ్ సినీయర్ నటుడు కలెక్షన్ కింగ్ మెహన్బాబు స్పందించారు. దిశపై అత్యాచారం, హత్య జరిగిన నాతో పాటు ఎంతో మంది భారతీయులు ఆ రక్షసులను చంపేవారు. పోలీసులు చట్టప్రకారం వెళ్తున్నారు. అలాంటి పోలీసుల దర్గర ఆయుదాలు తీసుకొని వారినే చంపాలని చూస్తే ఎన్ కౌంటర్ తప్ప మరో చాయిస్ లేదు.
భగవంతుడే పోలీసుల చేత ఈ పని చేయించినట్టుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులను అభినందనలు తెలుపుతున్నాన్నారు. దిశ ఆత్మకు శాంతి చేకురాలి కోరుకుంటున్నాని తెలిపారు. చట్టం, న్యాయం రెండు కళ్లయితే ధర్మం మూడో కన్ను. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆత్మవేదనలో ప్రజల కోసం దేవుడే ఈ పని చేయించాడని భావిస్తున్నా, తెలంగాణ పోలీసులను నా అభినందనలు తెలియ చేస్తున్న అంటూ మోహన్ బాబు ట్విట్టర్ లో తన అభిప్రాయం తెలిపారు.
చట్టం న్యాయం భారతీయులకు రెండు కళ్ళు . ధర్మం మూడో కన్ను. లేకపోతే దిశా ఘోరం జరిగిన రోజు నాతోపాటు ఎందరో వెళ్లి ఆ నరరూప రాక్షసులను ముక్కలు ముక్కలుగా నరికి ఉండేవారు.
— Mohan Babu M (@themohanbabu) December 6, 2019
పోలీసులు చట్ట ప్రకారం తమ పని తాము చేసుకుంటూ వెళుతుంటే వారి కన్ను కప్పి పారిపోవడం వేరు వారి చేతిలోని ఆయుధాలను గుంజుకుని వారినే చంపాలని చూస్తే వారిదగ్గరున్న ఆప్షన్ ఎన్ కౌంటర్ మాత్రమే.
— Mohan Babu M (@themohanbabu) December 6, 2019