ఫ్యామిలీతో కలిసి అమెరికాకి మహేష్..

షూటింగ్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే మహేశ్‌కు ఏ మాత్రం తీరిక దొరికినా కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. గత ఆరేడు నెలలుగా కొవిడ్‌ కారణంతో ఇంటికే పరిమితమైన మహేశ్‌ బాబు... ఈమధ్య కొన్ని యాడ్‌ షూట్స్‌ కోసం బయటకు వచ్చారు.

Update: 2020-11-08 14:41 GMT

షూటింగ్స్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే మహేశ్‌కు ఏ మాత్రం తీరిక దొరికినా కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. గత ఆరేడు నెలలుగా కొవిడ్‌ కారణంతో ఇంటికే పరిమితమైన మహేశ్‌ బాబు... ఈమధ్య కొన్ని యాడ్‌ షూట్స్‌ కోసం బయటకు వచ్చారు. అవి పూర్తి కాగానే ఫ్యామిలీతో సహా అమెరికా బయలుదేరారు మహేశ్ బాబు‌. ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ సైతం పిల్ల‌ల‌తో క‌లిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక అటు జనవరి నుండి మహేశ్‌ 27వ సినిమా 'సర్కారువారిపాట' సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందే మహేశ్ కుటుబంతో కలిసి‌ అమెరికా బయలుదేరాడు. షూటింగ్‌ మొదలయ్యే వరకు కుటుంబంతో అమెరికాలో ఎంజాయ్‌ చేసేలా ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సర్కారువారి పాట విషయానికి వచ్చేసరికి గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.

ఇక మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. అటు ఈ ఏడాది సర్కారు వారీ పాట సినిమాతో భారీ హిట్ కొట్టాడు మహేష్ బాబు.

Tags:    

Similar News