Naga Chaitanya : ఆఫీషియల్.. దిల్ రాజు బ్యానర్ లో నాగచైతన్య!

Naga Chaitanya : విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్... ఇష్క్ సినిమాతో టాలీవుడ్ లో మంచి

Update: 2020-08-29 07:35 GMT

Dil Raju, Naga Chaitanya

Naga Chaitanya : విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్... ఇష్క్ సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన విక్రమ్... ఏకంగా అక్కినేని కుటుంబం డ్రీం ప్రాజెక్ట్ మనం సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో విక్రమ్ కె.కుమార్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు.. ఆ తర్వాత అఖిల్ తో చేసిన హలో ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది.. తాజాగా అక్కినేని నాగచైతన్యతో సినిమాని చేసేందుకు రెడీ అయిపోయారు విక్రమ్.

ఈ రోజు (ఆగస్టు 29)న నాగచైతన్య తండ్రి నాగార్జున 61వ పుట్టినరోజు సందర్భంగా చైతూ, విక్రమ్ కె.కుమార్ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి 'థ్యాంక్యూ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. 'మనం' తర్వాత నాగచైతన్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది.. ఇక దిల్ రాజు సంస్థలో నాగచైతన్య కూడా ఇదో రెండో సినిమా.. అంతకుముందు వీరి కాంబినేషన్ లో జోష్ అనే సినిమా తెరకెక్కింది.. నాగ‌చైత‌న్యకి ఇది 20 వ సినిమా కావడం విశేషం.. త్వరలోనే నటీనటులను ఎంపిక చేయనున్నారు.



ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నాగచైతన్య సరసన ఫిదా భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమా పైన మంచి హైప్ క్రియేట్ చేశారు.. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. వాస్తవానికి ఈ సినిమా తర్వాత నాగ చైతన్య పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబుతో పరశురాం సినిమా ఫిక్స్ అవడంతో నాగ చైతన్య విక్రమ్ కె.కుమార్ సినిమా ని లైన్ లో పెట్టాడు. 

Tags:    

Similar News