స్వామివారి సేవలో పాల్గొన్న సినీ దర్శకుడు గోపిచంద్‌...

Tirumala: స్వామివారి సేవలో పాల్గొన్న సినీ దర్శకుడు గోపిచంద్‌, శ్రీవారిని దర్శించుకున్న పాండిచ్చేరి డిప్యూటీ స్పీకర్‌ రాజు వేలు.

Update: 2022-01-29 06:30 GMT

స్వామివారి సేవలో పాల్గొన్న సినీ దర్శకుడు గోపిచంద్‌...

Tirumala: ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ దర్శకుడు గోపిచంద్‌ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయంలో పాండిచ్చేరి డిప్యూటీ స్పీకర్‌ రాజు వేలు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పివి సతీష్ కుమార్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అదికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నందమూరి బాలకృష్ణతో త్వరలో కొత్త సినిమాను‌ సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు ప్రముఖ దర్శకుడు గోపిచంద్ తెలిపారు. ఈ సందర్భంగా సినిమా స్టోరీ సాఫ్ట్ కాపీలను తిరుమలేశుని పాదాల చెంతనుంచి ప్రత్యేక పూజలు చేయించారు.

Tags:    

Similar News