ముచ్చటగా మూడోసారి?

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న వెంకీ ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.. ఇప్పటికే వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చిన ఛలో, భీష్మ చిత్రాలలో రష్మికనే హీరోయిన్ గా నటించింది

Update: 2020-12-12 10:59 GMT

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌ ని మొదలుపెట్టనుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు 'ఛలో' ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ ఏడాది నితిన్‌, రష్మిక మందన్నా హీరో హీరోయిన్స్ గా వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం వెంకీ కుడుముల ఇటీవల ఓ సరికొత్త కథతో హీరో రామ్‌ చరణ్‌ను కలిసినట్లు సమాచారం. అయితే ఈ కథకి పెద్దగా రామ్ చరణ్ ఇంప్రెస్ కాకపోవడంతో నో చెప్పాడట. దీంతో వెంటనే వెంకీ, మహేష్‌ బాబు వద్దకు వెళ్లి ఇదే కథ వినిపించగా ఈ సినిమాలో నటించేందుకు మహేష్ ఆసక్తి చూపించినట్టుగా సమాచారం.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న వెంకీ ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.. ఇప్పటికే వెంకీ కుడుమల దర్శకత్వంలో వచ్చిన ఛలో, భీష్మ చిత్రాలలో రష్మికనే హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మహేష్, రష్మిక జోడికి మంచి మార్కులే పడ్డాయి. దీనితో మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలనీ వెంకీ భావిస్తున్నాడట.!

Tags:    

Similar News