కరోనా భయం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు. ఈ వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వాలు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. టాలీవుడ్పై కరోనా ఎఫెక్ట్ పడింది. కొద్ది రోజులు సినిమా థియేటర్లు బంద్ చేసే యోచనలో ఫిల్మ్ ఛాంబర్ ఉంది. సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సినిమా థియేటర్ల బంద్పై నిర్ణయం తీసుకోనున్నారు.