బ్యాడ్‌ న్యూస్‌ .. చిత్రం విడుదలపై రాంగోపాల్ వర్మ ట్వీట్

Update: 2019-12-11 14:19 GMT
Rgv file Photo

ఎట్టకేలకు వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడప బిడ్దలు చిత్రం విడుదల కానుంది. సెన్సార్‌ బోర్డు నుంచి ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో గురువారం సినిమా విడుదల కానుంది. అయితే బుధవారం ఈ చిత్రం విడుదల ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, చిత్ర యూనిట్‌ కౌంటర్‌ దాఖలు చేసింది. అభ్యంతరకర సన్నివేశాలు తొలిగించామని తెలిపింది. రివ్యూ కమిటీ రిపోర్ట్ ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తెలిపింది.

రివ్వూ కమిటీ రిపోర్టు ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో చిత్రం విడుదలకు మార్గం సుగుమయమైంది. దీనిపై రాం గోపాల్ వర్మ ట్విట్ చేశారు. సినిమా అపాలని చూసిన వారికి బ్యాడ్ న్యూస్ అన్నారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ ఇచ్చింది. అనుకున్న ప్రకారమే గురువారం చిత్రం విడుదల అవుతోంది. భారత రాజ్యాంగం ప్రసాధించిన భావ ప్రకటన స్వేచ్చను అడ్డుకోలేకపోయారు అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్‌ చేశాడు. రేపు విడుదల అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటూ ట్వీట్ చేశారు.





Tags:    

Similar News