Biggboss 9 : బిగ్ బాస్ 9లో రెబల్స్ గేమ్ థ్రిల్లింగ్ ట్విస్ట్.. సీక్రెట్ టాస్క్ తో పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ రేస్ నుంచి ఔట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ ఊహించని మలుపులు, నాటకీయ పరిణామాలతో ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. ఈ వారం హౌస్లో కెప్టెన్సీ టాస్క్లు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.
Biggboss 9 : బిగ్ బాస్ 9లో రెబల్స్ గేమ్ థ్రిల్లింగ్ ట్విస్ట్.. సీక్రెట్ టాస్క్ తో పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ రేస్ నుంచి ఔట్!
Biggboss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ ఊహించని మలుపులు, నాటకీయ పరిణామాలతో ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. ఈ వారం హౌస్లో కెప్టెన్సీ టాస్క్లు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశపెట్టిన రెబల్స్ గేమ్ మొత్తం ఆట స్వరూపాన్నే మార్చేసింది. ఈ సీక్రెట్ టాస్క్ కారణంగా పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ రేస్ నుంచి అకాలంగా ఔట్ అవ్వడం హౌస్లో చిన్నపాటి ఆగ్రహానికి దారి తీసింది. పాలు దాచడం, కంటెండర్లను తప్పించడం వంటి రెబల్స్ చిలిపి పనులు.. హౌస్లో ఎలాంటి థ్రిల్లింగ్ ట్విస్టులకు దారితీశాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 9వ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్తో హౌస్ మొత్తం సందడిగా మారింది. బిగ్ బాస్ మొదట బ్లూ, పింక్, ఆరెంజ్ అనే మూడు టీమ్లను ఏర్పాటు చేసి, సభ్యులను ఎంచుకునే బాధ్యతను కంటెస్టెంట్లకు అప్పగించాడు. టీమ్లు ఏర్పడిన తర్వాత, సంజన ఏ టీమ్లోనూ చోటు దక్కించుకోకపోవడంతో ఆమెను కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించి, సంచాలక్గా నియమించారు.
టాస్క్ ప్రారంభానికి ముందు బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. హౌస్లోని ఇద్దరు సభ్యులను రెబల్స్ గా మార్చి, వారికి సీక్రెట్ టాస్క్లు అప్పగించారు. మొదటి రెబల్గా సుమన్ శెట్టి, రెండవ రెబల్గా దివ్య నియమితులయ్యారు. రెబల్స్ తమ టాస్క్లలో గెలిస్తే, వారు కెప్టెన్సీ కంటెండర్గా మారవచ్చు, లేదంటే ఎలిమినేట్ అవుతారు. రెబల్స్ తమ సీక్రెట్ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా హౌస్లో పెను మార్పుకు కారణమయ్యారు.
దివ్య తన తొలి సీక్రెట్ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయడంతో, ఒక కంటెండర్ను రేస్ నుంచి తొలగించే అధికారం లభించింది. సుమన్తో చర్చించిన తరువాత, వారు పవన్ కళ్యాణ్ను కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలని నిర్ణయించారు. బిగ్ బాస్ ఫోన్ ద్వారా ఈ ఆదేశాలు పవన్కు అందాయి. దీనికి నవ్వుతూ స్పందించినా, పవన్ నా బొంద.. శార్ధం! అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
రెబల్స్కు తదుపరి సీక్రెట్ టాస్క్ వచ్చింది. హౌస్మేట్స్కు తెలియకుండా పాలు దాచడం. అర్థరాత్రి 2:45 గంటలకు సుమన్, దివ్య దొంగల్లా జాగ్రత్తగా ప్లాన్ చేసి, పాలన్నింటినీ స్టోర్ రూమ్లో దాచిపెట్టారు. పవన్ కళ్యాణ్కు కొంచెం అనుమానం వచ్చినా, దివ్య చాకచక్యంగా కవర్ చేసి ఈ టాస్క్ను కూడా విజయవంతం చేసింది. టాస్క్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు మరియు చిన్నపాటి గొడవలు చోటుచేసుకున్నాయి.
బిగ్ బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్, రీతూ మాట్లాడకూడదు. డిన్నర్ సమయంలో వారు మాట్లాడటానికి ప్రయత్నించగా, రెబల్ అయిన దివ్య వారిని ఆపింది. దీంతో కోపంతో రీతూ టాస్క్ గురించి మాట్లాడుతున్నాం అంటూ దివ్యతో వాదించింది. పవన్ కూడా జోక్యం చేసుకోవడంతో చిన్నపాటి గొడవ జరిగింది. కెప్టెన్సీ టాస్క్లో భాగంగా సీసా బ్యాలెన్స్ అనే టాస్క్ ఇవ్వగా, ఆరెంజ్ టీమ్ (తనూజా - ఇమ్మాన్యుయేల్ - గౌరవ్) విజయం సాధించింది. బిగ్ బాస్ వారికి గ్రీన్ ఇమ్యూనిటీ బ్యాడ్జ్ను సత్కరించారు. ఆ టీమ్ సభ్యులు కలసి ఆ బ్యాడ్జ్ను ఇమ్మాన్యుయెల్కు ఇవ్వడం విశేషం.