బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 28 : పళ్లు తోమించిన బిగ్ బాస్

శనివారం సరదాగా మొదలైంది బిగ్ బాస్ షో. పునర్నవి.. రాహుల్ ప్రేమకథ పాకాన పడుతోంది. వితిక వీరిద్దిరి మధ్యలో అడ్డుగా వస్తోంది.

Update: 2019-08-17 15:58 GMT

శనివారం సరదాగా మొదలైంది బిగ్ బాస్ షో. పునర్నవి.. రాహుల్ ప్రేమకథ పాకాన పడుతోంది. వితిక వీరిద్దిరి మధ్యలో అడ్డుగా వస్తోంది. రాహుల్ పునర్నవి మాట్లాడుకుంటుంటే, వచ్చిన వితిక టీ పెట్టు అంటూ వారి మధ్యలోకి వెళ్ళింది. పునర్నవి నువ్వే పెట్టు అని అక్కడ నుంచి కదల లేదు. వితిక ఆమెను సోఫాలోంచి ఎత్తి కింద పాడేసింది. ఇదిలా నడుస్తుంటే బిగ్ బాస్ మధ్యలో హౌస్ మేట్స్ కి పళ్లు తోమించాడు. రెండు తీములుగా విడిపోయి గార్డెన్ ఏరియాలో పెట్టిన పెద్ద సైజు దంతాలను ఒక టీము తోముతుంటే.. ఇంకో టీము నల్ల రంగు పోయాలి. బజార్ మొగేసరికి పళ్ళు మీద మరకలు ఉంటె, తోమిన టీము ఓడినట్టు. వరుణ్ దీనికి అంపైర్ గా వ్యవహరించాడు. బజర్ మొగినప్పటికీ బాబా భాస్కర్, అషు రెడ్డి రంగు పోయడంతో ఆ టీము ఓడిపోయినట్టు వరుణ్ ప్రకటించాడు.


Tags:    

Similar News