గాయకుడు అర్జిత్‌సింగ్ లైవ్ ప్రొగ్రాం..నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Update: 2019-11-23 02:16 GMT
Arijit Singh

నగరంలోని ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ వెల్లడించారు. ప్రముఖ గాయకుడు అర్జిత్‌సింగ్ లైవ్ కార్యక్రమం ఉన్నందున ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

వాహనదారులు ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి పీజేఆర్ విగ్రహంపై జంక్షన్ వరకు ట్రాఫిక్ అనుమతిలేదని వెల్లడించారు. గన్‌ఫౌండ్రీ,అబిడ్స్ వద్ద నుంచి బీజేఆర్ విగ్రహాం వైపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. బహీర్ బాగ్ అబిడ్స్ , వచ్చే వాహనాలు హైదర్ గూడ, కింగ్ కోఠి మీదుగా వెళ్లాలని పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ వెల్లడించారు.

కాగా...వైమ్యూజిక్ మైకంట్రీ పేరుతో సినీ గాయకులు అర్జిత్‌సింగ్ సంగీత విభావరి శనివారం హైదరాబాద్ నగరంలోని ఎబ్బీ స్టేఢియంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు టాకీస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బుక్ మై షో సహకారంతో నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. అయితే సోమవారం సంగీత విభావరికి చెందిన వాల్ పోష్టర్ ను సంస్థ ప్రతినిధులు సాయినాథ్ గౌడ్ విడుదల చేశారు.

Tags:    

Similar News