దిల్ రాజు మేనల్లుడితో అనుపమ
అందం, అభినయంతో ఆకట్టుకోగల నటి అనుపమ పరమేశ్వరన్ .. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది ఈ భామ..
అందం, అభినయంతో ఆకట్టుకోగల నటి అనుపమ పరమేశ్వరన్ .. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది ఈ భామ.. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ..ఆ' చిత్రంలో నాగవల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలలో నటించింది. ఇక గత ఏడాది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన రాక్షసుడు చిత్రంలో నటించి సక్సెస్ ని అందుకుంది.
ఇక ఇది ఇలా ఉంటే దిల్ రాజు మేనల్లుడు అశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో అనుపమ హీరోయిన్ గా ఫైనల్ అయింది. 'హుషారు' ఫేం శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి గాను అనుపమ మంచి రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ.. ఇక అంతకుముందు దిల్ రాజ్ బ్యానర్ లో రెండు సినిమాలలో నటించిన అనుపమ ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాలో నటిస్తోంది.