లక్కీ ఛాన్స్ కొట్టిన రష్మి..

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో మరో చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది

Update: 2019-12-08 15:49 GMT
rashmi gautam and nandamuri balakrishna

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్‌. కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య సరనస సోనాలి చౌహాన్, వేదికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జయసుధ, ప్రకాష్ రాజ్ , భూమిక ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌ 20 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇది ఇలా ఉండగానే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో మరో చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్‌ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి. అయితే వీరి ఇద్దరి కలయికలో వచ్చే తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే బోయపాటి సినిమాపై స్పందించారు. నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసేలా చిత్రం ఉంటుందని బోయపాటి స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ సన్నపడ్డారు కూడా. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమా కోసం నటీ, బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ కనిపిస్తారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సినిమాలో ఓ ముఖ‌్య పాత్ర కోసం దర్శకుడు బోయపాటి రష్మీని అడిగారట. బాలయ్య సినిమాలో చాన్స్ రావడంతో అది కూడా బోయపాటి ఆమెను అప్రోచ్ కావంతో ఓకే చెప్పిందని సమాచారం. గుంటూర్ టాకీస్, నెక్స్ట్ నువ్వే, తనువచ్చనట వంటి సినిమాలా తర్వాత రష్మీకి చెప్పుకో దగ్గ పాత్రలేవి రాలేదు. బోయపాటి సినిమాలో మహిళలకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉంటాయి, కాస్త లేటైనా కానీ అగ్ర కథానాయకుడి సరసన లక్కీ ఛాన్స్ కొట్టిందని టాక్ నడుస్తోంది. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News