'అఖండ' ఇండస్ట్రీకి ఊపిరిపోసింది.. శ్రీవారిని దర్శించుకున్న..

Akhanda Movie Team: కరోనాతో డీలా పడిపోయిన సినీ పరిశ్రమకు అఖండ చిత్రం ఊపిరిపోసిందన్నారు హీరో నందమూరి బాలకృష్ణ.

Update: 2021-12-16 07:13 GMT

'అఖండ' ఇండస్ట్రీకి ఊపిరిపోసింది.. శ్రీవారిని దర్శించుకున్న..

Akhanda Movie Team: కరోనాతో డీలా పడిపోయిన సినీ పరిశ్రమకు అఖండ చిత్రం ఊపిరిపోసిందన్నారు హీరో నందమూరి బాలకృష్ణ. శ్రీవారి దర్శనార్థం నిన్నరాత్రి తిరుమలకు చేరుకున్న సినిమా యూనిట్, ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిలకు పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు శేషవస్త్రంతో సత్కరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. అఖండ చిత్రానికి అఖండ విజయం చేకూర్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ.

Full View


Tags:    

Similar News