టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. టాలీవుడ్ భళ్లాలదేవ రానా నటిచించిన తొలి చిత్రం లీడర్ మూవీలో తెలుగు ప్రేక్షకులకు రిచా గంగోపాధ్యాయ పరిచయం అయ్యారు.
ప్రముఖ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగినట్ల తెలుస్తోంది. రిచా గంగోపాధ్యాయ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. టాలీవుడ్ భళ్లాలదేవ రానా నటిచించిన తొలి చిత్రం లీడర్ మూవీలో తెలుగు ప్రేక్షకులకు రిచా గంగోపాధ్యాయ పరిచయం అయ్యారు. తర్వాత వెంకటేష్ నటించిన నాగవల్లి, రవితేజతో విరపకాయ్, బాహుబలి ప్రభాస్ తో సరసన మిర్చి వంటి చిత్రాల్లో నటించారు.
అంతే కాకుండా తమిళం, బెంగాళీలోని పలు చిత్రాల్లోఆమె నటిచారు. కాగా, 2018 తర్వాత ఉన్నత చదువుల కోసం వాషింగ్దన్ వెళ్లారు. దీంతో కొంత కాలంగా ఆమె సినిమాకు దూరంగా ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె వివాహం చేసుకుందని తెలుస్తోంది. ఈ
అక్కడ తన తోటి విద్యార్థి జోతో ప్రేమలోపడ్డారని, ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, ఈ ఏడాది రిచా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు
కాబోయే భాగస్వామితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
అతిని గురించి పోస్టు చేశారు. రెండేళ్ల క్రితం బిజినెన్ స్కూల్లో జోతు పరిచయం అయ్యారని, వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు.
కానీ ఇటీవల జోతో రిచా వివాహం జరిగిందని తెలుస్తోంది. క్రిస్టియన్, హిందూ మత సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుకలో తీసిన ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. కానీ రిచా గంగోపాద్యాయ మాత్రం అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించలేదు.