ఐపీఎల్‌ టైమింగ్ మార్చలన్నాడు.. వంటలక్కే టీవీ కొనిచ్చింది

Premi Viswanath : మాటీవీలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన

Update: 2020-09-19 11:37 GMT

premi viswanath surprise gift 

Premi Viswanath : మాటీవీలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సీరియల్ తరవాత చాలా సీరియళ్ళు వచ్చాయి కానీ ఏది కూడా ఈ సీరియల్‌ టీఆర్పీ రేటింగ్‌ ల్లో దరిదాపుల్లో కూడా నిలవలేకపోయాయి.. కేవలం సీరియళ్ళు మాత్రమే కాదు స్టార్ హీరోల సినిమాలు కూడా టీఆర్పీ రేటింగ్‌ లలో కార్తీకదీపం సీరియల్‌ ను టచ్ చేయలేకపోయాయి అంటే అర్ధం చేసుకోవచ్చు.. ఇక ఈ సీరియల్‌ మాటీవీలో ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.. అయితే అదే సమయంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ కి సంబంధించిన మ్యాచ్‌లు కూడా అప్పుడే మొదలుకనున్నాయి. ఈ క్రమంలో కార్తీకదీపం సీరియల్ అభిమానులకి పెద్ద చిక్కొచ్చి పడింది.

అయితే ఆ మధ్య కార్తీకదీపం సీరియల్‌ కోసం ఐపీఎల్‌ మ్యాచ్ టైమింగ్స్ మార్చాలంటూ సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్‌ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో పాటు చెన్నై ఐపీఎల్‌ టీమ్‌, స్టార్‌ మాకి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చాలా వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇది చాలా సీరియస్‌ ఇష్యూ అని.. ఎలాగైనా ఐపీఎల్‌ మ్యాచ్‌లను రాత్రి 8 గంటలకు ప్రసారం చేయమని చెప్పవలసిందిగా స్టార్‌ మాకి కూడా సెపరేట్‌గా ట్వీట్‌ చేశాడు. దీనిపైన మాటీవీ కూడా స్పందించింది.

అయితే ఈ సీరియల్ కి ఇంతమంది ప్రేక్షకులు ఉన్నారా అని తెలుసుకొని నటి ప్రేమి విశ్వనాథ్ ఆశ్చర్యపోయింది. అభిమానుల కోసం ఐపీఎల్‌ మ్యాచ్ టైమింగ్ లను మార్చడం కుదరదు కాబట్టి తానే స్వయంగా 32 అంగుళాల టీవీని కొని శివచరణ్‌ ఇంటికి పంపించింది. దీనితో శివ చరణ్‌ ఇంట్లో టీవీ కోసం గొడవ పడే సమస్య వచ్చే ప్రసక్తి లేదు., ఎందుకంటే ఒక టీవీలో కార్తీక దీపం చూస్తుంటే , మరొక టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసే అవకాశం లభించింది కాబట్టి.. అటు ఈ రోజు నుంచి ఐపీఎల్‌ 13వ సీజన్‌ మొదలు అవుతున్న సంగతి తెలిసిందే.. 

Tags:    

Similar News