Govinda: ఏక్‌నాథ్ షిండేని కలిసిన బాలీవుడ్ స్టార్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..?

Govinda: గోవింద ముంబై నార్త్ వెస్ట్ నుంచి బరిలో దిగే ఛాన్స్

Update: 2024-03-28 13:35 GMT

Govinda: ఏక్‌నాథ్ షిండేని కలిసిన బాలీవుడ్ స్టార్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..?

Govinda: బాలీవుడ్ నటుడు గోవింద శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విరామం తర్వాత గోవింద రాజకీయాల్లోకి రావడంతో ముంబై నార్త్ వెస్ట్ నుంచి బరిలో దిగే అవకాశం ఉ:ది. గోవింద చేరికతో మహారాష్ట్రలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు గ్లామర్‌ను జోడించారు. గోవింద 2004లో ముంబై నార్త్ లోక్‌సభ నుండి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి బీజేపీకి చెందిన రామ్‌ నాయక్‌ను ఓడించారు. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి గోవింద పూర్తిగా విరామం తీసుకున్నారు.

Tags:    

Similar News